ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర : బీజేపీపై శివసేన విమర్శలు

ABN , First Publish Date - 2022-05-02T03:08:15+05:30 IST

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆ రాష్ట్ర విపక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన ఘాటైన ఆరోపణలు చేసింది.

ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర : బీజేపీపై శివసేన విమర్శలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆ రాష్ట్ర విపక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన ఘాటైన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను కేంద్ర హోంమంత్రిత్వశాఖకు దేవేంద్ర ఫడ్నవీస్ సమర్పించారని పేర్కొంది. కుట్రపూరిత ప్రణాళిక ప్రకారం.. ముంబైని రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని భావించారని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఎడిటోరియల్ ప్రచురితమైంది. మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేసే కుట్ర ఈ రోజుకీ ముగియలేదు. ముంబై నగర జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడింది. ఈ విషయం గురించి దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు బీజీపీ పార్టీకి సంపూర్ణ అవగాహన ఉందని ఎడిటోరియల్ పేర్కొంది. 

Updated Date - 2022-05-02T03:08:15+05:30 IST