ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15లక్షలు వసూల్ చేసిన కానిస్టేబుల్
ABN , First Publish Date - 2022-09-17T12:59:18+05:30 IST
2019లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.15లక్షలు తీసుకున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కూసు మంచికి చెందిన చెన్ను యాదగిరి
ఖమ్మం: 2019లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.15లక్షలు తీసుకున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని కూసు మంచికి చెందిన చెన్ను యాదగిరి ఫ్లెక్సీతో శుక్రవారం కలెక్టరేట్లో నిరసనకు దిగాడు. వైరా పోలీసుస్టేషనలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని 2019లో మూడు దఫాలుగా రూ.15లక్షలు వసూలు చేశాడని, ఉద్యోగం ఇప్పించ కుండా డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నాడని తెలిపారు. తన జోలికి వస్తే నీకే ప్రమాదం అంటూ బెదరిస్తున్నారని, కానిస్టేబుల్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు యాదగిరి తెలిపారు.