సీఎం ఇంటి గార్డుడ్యూటీ కానిస్టేబుల్ మృతి
ABN , First Publish Date - 2021-04-22T10:43:46+05:30 IST
ఇడుపులపాయలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని ఇంటివద్ద గార్డు డ్యూటీ చేస్తున్న ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ బోశాల ప్రభాకర్ (48) మృతిచెందాడు.
వేంపల్లె, ఏప్రిల్ 21: ఇడుపులపాయలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని ఇంటివద్ద గార్డు డ్యూటీ చేస్తున్న ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ బోశాల ప్రభాకర్ (48) మృతిచెందాడు. ఆర్కేవ్యాలీ ఎస్ఐ కృష్ణమూర్తి కథనం మేరకు.. గిద్దలూరుకు చెందిన బోశాల ప్రభాకర్ ఏపీఎస్పీ 11వ బెటాలియన్ డీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇడుపులపాయలోని వైఎస్ జగన్ ఇంటి వద్ద విధులకు నెలక్రితం వచ్చాడు. బుధవారం ఉదయం ఛాతిలో నొప్పి ఉందంటూ ఇడుపులపాయ ఆస్పత్రిలో మందులు తీసుకొని వేసుకున్నాడు. విశ్రాంతి తీసుకునేందుకు గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మధ్యాహ్నం బయటకు రాకపోవడంతో తోటి కానిస్టేబుళ్లు లోపలికి వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ద్వారా పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు.