ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ABN , First Publish Date - 2020-11-27T04:25:19+05:30 IST
మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేడ్కర్
సీతారామపురం, నవంబరు 26 : మండల పరిషత్ కార్యాలయంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అబ్దుల్హమీద్, ఎంపీడీవో ఐజాక్ప్రవీణ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.