ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి

ABN , First Publish Date - 2021-07-27T03:18:42+05:30 IST

పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ప్లైఓవర్‌ బ్రిడ్జి పనులను ప్రారంభించాలని ఇన్సాఫ్‌ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలి
ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఇన్సాఫ్‌ కమిటీ సభ్యులు

గూడూరురూరల్‌, జూలై 26: పట్టణంలో అసంపూర్తిగా ఉన్న ప్లైఓవర్‌ బ్రిడ్జి పనులను ప్రారంభించాలని ఇన్సాఫ్‌ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఇన్సాఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడూరు ఒకటి, రెండో పట్టణాలను కలిపే ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం ఎన్నోఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఆసుపత్రి రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఆసుపత్రి రోడ్డును అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీ ఈఈ రామాంజనేయులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలేషా, అన్వర్‌బాషా, ఇబ్రహీం, జమాలుల్లా, హసీం, జాకీర్‌, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T03:18:42+05:30 IST