మార్కెట్‌ కమిటీలో రూ.5 లక్షలతో ల్యాబ్‌ నిర్మాణం

ABN , First Publish Date - 2021-03-07T04:58:59+05:30 IST

మార్కెట్‌ కమిటీలో నాణ్యతా పరీక్షల కోసం రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్‌ భవన నిర్మాణ పనులను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.మల్లికార్జున్‌గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడారు.

మార్కెట్‌ కమిటీలో రూ.5 లక్షలతో ల్యాబ్‌ నిర్మాణం

జోగిపేట రూరల్‌, మార్చి 6 : మార్కెట్‌ కమిటీలో నాణ్యతా పరీక్షల కోసం రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్‌ భవన నిర్మాణ పనులను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.మల్లికార్జున్‌గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడారు. మార్కెట్‌ యార్డులోకి రైతులు తీసుకొచ్చే ధాన్యం, ఇతర పంటల నాణ్యతను పరిశీలించేందుకుగాను ప్రభుత్వం ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి పిర్లమర్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు భిక్షపతి, కోశాధికారి వూడెంకాడి ఆంజనేయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T04:58:59+05:30 IST