భవన నిర్మాణ కార్మికులను కర్ఫ్యూ నుంచి మినహాయించాలి

ABN , First Publish Date - 2021-05-11T04:45:27+05:30 IST

భవన నిర్మాణ కార్మికులను కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ భవ న నిర్మాణ కార్మిక సంఘం ఏరియా ప్రధాన కార్యదర్శి చిన్న ఓబన్న ప్రభుత్వాన్ని కోరారు.

భవన నిర్మాణ కార్మికులను  కర్ఫ్యూ నుంచి మినహాయించాలి

ప్రొద్దుటూరు టౌన్‌, మే 10: భవన నిర్మాణ కార్మికులను కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ భవ న నిర్మాణ కార్మిక సంఘం ఏరియా ప్రధాన కార్యదర్శి చిన్న ఓబన్న  ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు  సోమవారం పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా సంవత్సర కాలం నుంచి రాష్ట్రంలో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వలన కొన్ని నెలలపాటు, లాక్‌డౌన్‌ వలన కొంతకాలం, ఉపాధి లేక తినడానికి తిండిలేక చాలా ఇబ్బందిపడ్డారని కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత  నవంబరు నుంచి కరోనా తగ్గుముఖం పట్టడంతో కార్మికులు పనులకు వెళుతున్నారని కొద్దిరోజులకే కరోనా రెండో దశ తీవ్రతరమవడంతో పనులు లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల వరకే తిరగడానికి అనుమతి ఇచ్చిందని ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తోందన్నారు. దీని వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మికుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూ నుంచి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సుధాకర్‌, ఉపాధ్యక్షుడు శేషారెడ్డి, సహా య కార్యదర్శులు కుమార్‌, సుదర్శన్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:45:27+05:30 IST