నవంబరు నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి : జేసీ
ABN , First Publish Date - 2021-07-28T04:52:05+05:30 IST
జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులను నవంబరు నాటికి పూర్తి చేయాలని జేసీ మహేష్కుమార్ ఆదేశించారు.
కలెక్టరేట్, జూలై 27 : జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న భవన నిర్మాణ పనులను నవంబరు నాటికి పూర్తి చేయాలని జేసీ మహేష్కుమార్ ఆదేశించారు. మంగళ వారం తన చాంబర్ లో పనులపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... సుమారు రూ.245 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 664 సచివాలయ భవనాల పనులు వేగవంతం చేయాలని చెప్పారు. రూ.134.72 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 620 ఆర్బీకే భవనాల నిర్మాణాన్ని సకాలంలోని పూర్తి చేయాలని తెలిపారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ విజయకుమార్, ఈఈ కేజీవీ నాయుడు, డీఈఈ గంగాధరరావు పాల్గొన్నారు.