కంటైనర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

ABN , First Publish Date - 2022-06-26T06:35:35+05:30 IST

ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో 44వ జాతీయ రహదారిపై కంటైనర్‌ ఢీకొని అయ్యమ్మ(72) మృతి చెందింది.

కంటైనర్‌ ఢీకొని మహిళ దుర్మరణం

కర్నూలు, జూన్‌ 25: ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో 44వ జాతీయ రహదారిపై కంటైనర్‌ ఢీకొని అయ్యమ్మ(72) మృతి చెందింది. వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామా నికి చెందిన అయ్యమ్మ తన పుట్టినిల్లు అయిన చిన్న టేకూరుకు వచ్చింది. తిరిగి కృష్ణాపురం గ్రామానికి శనివారం తన మేనల్లుడును వెంట పెట్టుకుని చిన్నటేకూరు 44వ జాతీయ రహదా రిపై వెళ్తుండగా.. డోన్‌ వైపు నుంచి కర్నూలు వైపు అతి వేగంగా వెళ్తున్న కంటైనర్‌ మినీ లారీ ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో అయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెం దింది. అయ్యమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమెకు భర్త ఓబులేసుతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయ్యమ్మ బంధువైన వెంకటరమణ  ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌ మహేష్‌పై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శరత్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2022-06-26T06:35:35+05:30 IST