కంటైన్మెంట్ జోన్
ABN , First Publish Date - 2021-04-23T05:25:23+05:30 IST
పట్టణంలోని టాక్సీస్టాండ్ ప్రాంతంలో 4పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ కెటి.సుధాకర్ తెలిపారు.
కొవ్వూరు, ఏప్రిల్ 22 : పట్టణంలోని టాక్సీస్టాండ్ ప్రాంతంలో 4పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ కెటి.సుధాకర్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లోని ప్రజలు బయటకు, బయటి వారు లోనికి రాకుండా కర్రలతో బారీకేడ్స్ ఏర్పాటుచేసి హెచ్చరిక బోర్డులను పెట్టారు. సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ కెటి.సుధాకర్ తెలిపారు.
మేడేపల్లిలో ఇద్దరు విద్యార్థులకు కరోనా
వేలేరుపాడు : మండలంలోని మేడేపల్లిలో ఇద్దరు పాఠశాల విద్యార్థులకు కరోన పాజిటివ్ రావడంతో గ్రామంలో కలకలం రేగింది. పాఠశాల విద్యార్థులు కావడంతో మిగిలిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోన ఇంకా ఎంత మందికి సోకిందోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై వేలేరుపాడు ప్రభుత్వ వైధ్యాధికారి నశ్రీన్ వివరణ ఇస్తూ మిగిలిన విద్యార్థులకు పరీక్ష చేస్తామన్నారు.