వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: రఘురామ

ABN , First Publish Date - 2021-10-18T19:42:35+05:30 IST

వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సంస్థాగత

వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: రఘురామ

ఢిల్లీ: వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని తెలిపారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు. వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాగా.. స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని లేఖలో కోరారు.

Updated Date - 2021-10-18T19:42:35+05:30 IST