జువారీలో కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-03-01T04:51:41+05:30 IST

జువారీ సిమెంటు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్న కె.చంద్రమోహన్‌ రెడ్డి(35) ఆదివారం ప్లాంటులోని కోల్‌మిల్‌ మొదటి అం తస్తులోని రెస్ట్‌రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.

జువారీలో కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య

ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 28: జువారీ సిమెంటు కర్మాగారంలో కాంట్రాక్టు కార్మికుడుగా పనిచేస్తున్న కె.చంద్రమోహన్‌ రెడ్డి(35) ఆదివారం ప్లాంటులోని కోల్‌మిల్‌ మొదటి అం తస్తులోని రెస్ట్‌రూంలో  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. కోల్‌మిల్‌ పనిచేస్తున్న చంద్రమోహన్‌ ఆదివారం జనరల్‌ షిఫ్ట్‌కు లోపలికి వెళ్లి సాయంత్రం 5గంటల తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆరా తీశారు. దీంతో లోపల పరిశీలించిన సంబంధిత అధికారు లకు చంద్ర మోహన్‌రెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. ఈవిషయాన్ని పోలీసులకు తెలపడంతో సీఐ సదాశివయ్య సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాడు. పాలురుకు చెందిన చంద్రమోహన్‌ జువారీ సమీపంలోని వై.కోడూరులో వివాహం చేసుకుని ఎర్రగుంట్లలో నివాసం ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2021-03-01T04:51:41+05:30 IST