డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-04-29T15:29:20+05:30 IST
వర్గపోరులో వైసీపీ రెడ్లు దళితవాడలపై పడుతున్నారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు: వర్గపోరులో వైసీపీ రెడ్లు దళితవాడలపై పడుతున్నారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రెడ్లు రెండు గ్రూపులుగా అయ్యారంటే.. వారి ధ్యేయమంతా దళితవాడలపై పడుతుందన్నారు. రెడ్ల గ్రూపులతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. ఎస్సీగా రిజర్వేషన్ లేకపోతే తనకు సీటు వచ్చేది కాదన్నారు. రెడ్లు యూనిటీగా లేకపోతే తాను గెలవలేనని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల సహకారం లేకపోతే మెజార్టీ వచ్చేది కాదన్నారు. చిన్నచిన్న గొడవలతో వైసీపీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం బాధేస్తోందని అన్నారు. తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే పదవికి రాజీనామా చేస్తానని నారాయణస్వామి పేర్కొన్నారు.