విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-07-25T06:30:45+05:30 IST

మండల పరిధిలోని మొటుకుపల్లికి చెందిన కూలీ మూడే శ్రీనివాసులు నాయక్‌ (36) వి ద్యుదాఘాతంతో శనివారం మృతి చెందా రు.

విద్యుదాఘాతంతో కూలీ మృతి

కదిరి అర్బన, జూలై 24: మండల పరిధిలోని మొటుకుపల్లికి చెందిన కూలీ మూడే శ్రీనివాసులు నాయక్‌ (36) వి ద్యుదాఘాతంతో శనివారం మృతి చెందా రు. సీఐ నిరంజనరెడ్డి తెలిపిన వివరాల మేరకు మొటుకుపల్లికి చెందిన రైతు బాబు తాను సాగుచేసిన పంటల ను సంరక్షించుకోవడానికి పొలం చుట్టూ వి ద్యుత తీగలను ఏర్పాటు చేశారు. అదే గ్రామానికి చెందిన మూడే శ్రీనివాసులనాయక్‌ శనివా రం ఉదయం ఉపాధి పనుల కోసం వెళ్తూ విద్యుత వైర్‌లు గమనించకుండా విద్యుత వైర్‌లకు తగి లాడు. దీంతో అతను విద్యుతషాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతు ని బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


Updated Date - 2021-07-25T06:30:45+05:30 IST