ఖిల్లా డిచ్‌పల్లిలో వడదెబ్బతో కూలీ మృతి

ABN , First Publish Date - 2021-04-18T06:04:01+05:30 IST

మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మేదరి సాయిలు (60) శనివారం ఉపాధి హామీ పనులు చేస్తూ ఎండలో నే సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఖిల్లా డిచ్‌పల్లిలో వడదెబ్బతో కూలీ మృతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మేదరి సాయిలు (60) శనివారం ఉపాధి హామీ పనులు చేస్తూ ఎండలో నే సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సురేంధ ర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకొని స్థానికులను వివరాలు అడి గి తెలుసుకున్నారు. గ్రామ చెరువులో ఉపాధి హా మీ పథకం ద్వారా గుంతలు తీస్తున్న సాయిలు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి మృతిచెందాడని ఎంపీడీవో తెలిపారు. మృతిచెందిన సాయిలు కుటుంబానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై ఆంజనేయులు శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-04-18T06:04:01+05:30 IST