ట్రాక్టర్పై నుంచి పడి మృతి
ABN , First Publish Date - 2021-03-06T05:36:04+05:30 IST
కోవెలకుంట్ల, మార్చి 5: ట్రాక్టర్పై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కోవెలకుంట్ల పట్టణంలో శుక్రవారం జరిగింది.
కోవెలకుంట్ల, మార్చి 5: ట్రాక్టర్పై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కోవెలకుంట్ల పట్టణంలో శుక్రవారం జరిగింది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. ఆళ్లగడ్డ మండలం ఎస్ లింగందిన్నెకు చెందిన ఓ రైతు తన ట్రాక్టర్లో ఐదుగురు కూలీలతో కలసి బనగానపల్లె మండలం రాళ్లకొత్తూరులోని నాయక్ అనే రైతు వద్ద వేరుశనక్కాయలు కొనుగోలు చేసి ట్రాక్టర్లో సంచులు ఎక్కించుకొని తిరిగి లింగందిన్నెకు బయల్దేరాడు. కోవెలకుంట్లలోని అంకాలమ్మ గుడి వద్ద స్పీడ్ బ్రేకర్లను దాటే క్రమంలో ట్రాక్టరుపై కూర్చున్న బండి రాజు (45) ఎగిరి కిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిద్దె కంబగిరి, నడిపి సుబ్బయ్య, షేక్ జాకీర్ హుశేన్ సురక్షితంగా బయట పడ్డారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని బండిరాజు మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బండిరాజుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.