Sidhu హత్యకు Tihar Jailలో Plan: పోలీసుల అనుమానం
ABN , First Publish Date - 2022-05-30T21:09:08+05:30 IST
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి. అక్కడ చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా పని చేశాడు. అనేక నేరాల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. పర్స్తుతం లారెన్స్ రాజస్తాన్లోని అజ్మీర్ జైలులో ఉన్నాడు. అయితే తాజా హత్యతో అతడికి ఏమాత్రం సంబంధం లేదని..
చండీగఢ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసెవాలా(Singer Sidhu Moose Wala) హత్యకు తీహార్ జైల్(Tihar Jail)లో ప్లాన్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ముందు నుంచి అనుమానిస్తున్న లారెన్స్ బిష్ణోయి(Lawrence Bishnoi) గ్యాంగ్కు చెందిన కాలాజతేడి, కాలారాణాలను తీహార్ జైలులో ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. కాగా, సిద్ధూ హత్య తమ పనేనన్న కెనడాలో నివసించే గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్కి లారెన్స్ టచ్లో ఉన్నాడట. గోల్డీతో టచ్లో ఉన్న మొబైల్ నంబర్ను తీహార్ జైలులో గుర్తించారు. ఈ నంబర్ను షారుఖ్ అనే వ్యక్తి ఉపయోగిస్తున్నాడు. ఇతడిపై 2 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
బిష్ణోయ్, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి. అక్కడ చదువుతున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా పని చేశాడు. అనేక నేరాల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి. పర్స్తుతం లారెన్స్ రాజస్తాన్లోని అజ్మీర్ జైలులో ఉన్నాడు. అయితే తాజా హత్యతో అతడికి ఏమాత్రం సంబంధం లేదని అతడి తరపు లాయర్ చెబుతున్నారు. ఈ విషయం గురించి అతడి లాయర్ను ప్రశ్నించగా.. ‘‘జైలు గోడల నడుమ నుంచి ఇంత పెద్ద హత్యకు ఎలా కుట్ర పన్నుతారు?’’ అంటూ ప్రశ్నించారు. అకాలీదళ్ నేత విక్కీ మిద్దుఖేర హత్యకు ఇది రివేంజ్గా జరిగిన హత్య అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. కారణం, సిద్ధూ హత్య అనంతరం అతడి సహాయకుడు కనిపించకుండా పోయాడు. ఈ హత్యలో అతడికి ఏదైనా ప్రమేయం ఉండచ్చనే కోణంలో సైతం దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.