కరోనా కట్టడికి మాస్కు రక్షణ కవచం
ABN , First Publish Date - 2021-04-18T06:06:48+05:30 IST
కరోనా కట్టడికి మాస్కు రక్షణ కవచం
పెనమలూరు, ఏప్రిల్ 17: కరోనా కట్టడికి మాస్కు రక్షణ కవచమని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. శనివారం పంట కాల్వ రోడ్డులోని వరంగల్ నిట్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రజల్లో అవ గాహన పెరగాలన్నారు. ఈ సందర్భంగా నిట్ కళాశాల అధ్యాపకుడు కుందేరు రంగారావు పూర్వ విద్యార్థుల సంఘానికి నాలుగు కంప్యూటర్లు, 1500 ఎన్ - 95 మాస్కులను కలెక్టర్కు అందజేశారు. వాటిని కలెక్టర్ పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం గ్లోబల్ ప్రెసిడెంట్ ఆలపాటి ప్రసాద్, సభ్యులు శ్రీరామ్, పద్మారావు, రంగారావు పాల్గొన్నారు.