మహానందిలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-22T05:39:55+05:30 IST

మహానంది మండలంలో కరోనా రోజు రోజుకూ విజృంభిస్తోంది. మండలంలో బుధవారం 67 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఎంపీహెచ్‌ఈఓ ఉసేన్‌రెడ్డి తెలిపారు.

మహానందిలో విజృంభిస్తున్న కరోనా

  1. ఆలయానికి తగ్గిన భక్తులు


 మహానంది, ఏప్రిల్‌ 21: మహానంది మండలంలో కరోనా రోజు రోజుకూ  విజృంభిస్తోంది.  మండలంలో   బుధవారం   67 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఎంపీహెచ్‌ఈఓ ఉసేన్‌రెడ్డి తెలిపారు. దీంతో ఆలయానికి  భక్తుల రాక చాల వరకు తగ్గిందన్నారు.    


శ్రీశైలంలో.. శ్రీశైలంలో మరోసారి కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుంది. బుధవారం ఒక్కరోజే 71 కరోన పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం డా. సోమశేఖర్‌ తెలిపారు. ఇప్పటి వరకు క్షేత్ర పరిధిలో 353 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క్షేత్ర పరిధిలో కేసులు ఉధృతం అవుతున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు, వైద్యసిబ్బంది అప్రమత్తం అయ్యారు.

Updated Date - 2021-04-22T05:39:55+05:30 IST