కరోనాతో 196 మంది వైద్యులు మృతి

ABN , First Publish Date - 2020-08-09T09:09:33+05:30 IST

కరోనా మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 196మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల కుటుంబ సభ్యులకు

కరోనాతో 196 మంది వైద్యులు మృతి

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కరోనా మహమ్మారి బారిన పడి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 196మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యుల కుటుంబ సభ్యులకు కరోనా సోకితే.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదని ఐఎంఏ సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌ఏ అశోకన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులకు ఇన్సూరెన్స్‌ తదితర సౌకర్యాలను అందించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ రాసింది.

Updated Date - 2020-08-09T09:09:33+05:30 IST