కరోనాకు ఏడాది పూర్తి.. సోషల్ మీడియాలో మీమ్స్

ABN , First Publish Date - 2020-11-17T23:49:49+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఏడాది పూర్తయిందట. సరిగ్గా ఇదే రోజున వూహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో...

కరోనాకు ఏడాది పూర్తి.. సోషల్ మీడియాలో మీమ్స్

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి ఏడాది పూర్తయిందట. సరిగ్గా ఇదే రోజున వూహాన్‌లో తొలి కరోనా కేసు నమోదైందట.  అయితే ఇది అనధికారిక లెక్కట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కరోనా ఫస్ట్ యానివర్సరీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కొందరైతే కరోనా మీమ్స్‌ను కూడా తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. చైనాకు చెందిన అనధికారిక నివేదిక ప్రకారం 2019 నవంబరు 17న తొలి కరోనా కేసు చైనాలో నమోదదైందట. స్థానిక హుబెయ్ ప్రావిన్స్‌లోని 55 ఏళ్ల వ్యక్తికి తొలిసారిగా కరోనా సోకిందనేది ఆ నివేదిక సారాంశం.


 మొత్తంగా నవంబరులోనే దాదాపు నలుగురు పురుషులు, అయిదుగురు మహిళలు కరోనా బారిన పడినట్లు సమాచారం. కానీ వీరినెవరినీ చైనా ప్రభుత్వం తొలి కరోనా కేసుగా గుర్తించలేదు. డిసెంబరులో వూహాన్ వెట్ మార్కెట్‌‌లో పనిచేస్తున్న ఓ మహిళనే పేషెంట్ జీరో అంటూ ప్రకటించింది.



Updated Date - 2020-11-17T23:49:49+05:30 IST