109మందికి పాజిటివ్‌.. ఓ మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-02T04:50:00+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తికొనసాగుతోంది. మంగళవారం ఇరుజిల్లాల్లో 109మందికి పాజిటివ్‌ రాగా.. దుమ్ముగూడెం మండలంలో ఓ మహిళ మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం1,492 మందికి పరీక్షలు చేయగా 79మందికి పాజిటివ్‌ వచ్చింది.

109మందికి పాజిటివ్‌.. ఓ మహిళ మృతి

 కొత్తగూడెం కలెక్టరేట్‌ / ఖమ్మంసంక్షేమం /దుమ్ముగూడెం, డిసెంబరు 1: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తికొనసాగుతోంది. మంగళవారం ఇరుజిల్లాల్లో 109మందికి పాజిటివ్‌ రాగా.. దుమ్ముగూడెం మండలంలో ఓ మహిళ మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం1,492 మందికి పరీక్షలు చేయగా 79మందికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో 44, భద్రాచలం డివిజన్‌లో 35మంది ఉన్నారు. ఖమ్మంజిల్లాలో 30మంది కొవిడ్‌ బారినపడ్డారు. దుమ్ముగూడెం మండలం దంతెనం గ్రామానికి చెందిన ఓ మహిళ(60) కరోనా లక్షణాలతో మృతిచెందింది. భద్రాచలం కొవిడ్‌ వార్డులో నాలుగు రోజులుగా వైద్యం పొందుతున్న ఆమె మంగళవారం మృతిచెందింది.

Updated Date - 2020-12-02T04:50:00+05:30 IST