ఎంపీడీవో కార్యాలయంలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-02-28T04:38:16+05:30 IST
మండలంలో ఇటీవల కరోనా కేసులు తగ్గాయి. కానీ ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వీరాపురంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరకగూడెం, ఫిబ్రవరి 27 : మండలంలో ఇటీవల కరోనా కేసులు తగ్గాయి. కానీ ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతుండటంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వీరాపురంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం కరకగూడెం వైద్యాధికారి ఏడుగురికి పరీక్షలు నిర్వహించగా.. ఒక పాజిటివ్ కేసు నమోదయినట్లు వైద్యాధికారి తెలిపారు. ఆ ఒకటి కూడా ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి రావడంతో మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.