వివిధ జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-09-09T01:09:52+05:30 IST

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా కేసులు బయట

వివిధ జిల్లాలో కరోనా కలకలం

మెదక్/ములుగు: రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా కేసులు బయట పడుతున్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసారు. అయితే అందరికీ నెగిటివ్ వచ్చింది. పాఠశాలకు రెండు రోజులపాటు సెలవులను అధికారులు ప్రకటించారు. 



 ములుగు:  జిల్లాలోని మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఆరుగురు విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో తల్లితండ్రులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-09-09T01:09:52+05:30 IST