మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకుందాం
ABN , First Publish Date - 2021-04-23T06:12:34+05:30 IST
కరోనా బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కా పా డుకుందామని ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి
మార్కాపురం, ఏప్రిల్ 22: కరోనా బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే కా పా డుకుందామని ఎమ్మెల్యే కుందురు నాగా ర్జునరెడ్డి పేర్కొన్నారు. గురువారం మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో పట్టణంలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకోనున్న ఆంక్షలపై స మావేశం నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం అమలు చేయనున్న ఆంక్షలను వ్యాపారులు తప్పక పాటించాలన్నారు. రెండో దశలో కరోనా వేగంగా వ్యాప్తి చెందు తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిం చాలని చెప్పారు. గతంలో కూర గాయల హోల్సేల్ దుకాణాలను వ్యవ సాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరి గిందని, ఈ సారీ కూడా అదేవిధంగా చర్య లు చేపట్టనున్నట్లు చెప్పారు. వ్యాపార సం స్థలకు ప్రతిరోజు రెండు విడతలుగా కా కుం డా ఒక విడత మాత్రమే విక్రయాలకు అను మతి ఇవ్వాలని వ్యాపార సంఘాల ప్రతిని దులు కోరారు. సమావేశంలో తహసీల్దార్ వి ద్యాసాగరుడు, కమిషనర్ నయీమ్ అహ్మద్, సీఐ రాఘవేంద్ర, మున్సిపల్ చైర్మన్ చిల్లం చెర్ల బాలమురళీకృష్ణ, వైస్చైర్మన్ షేక్ ఇ స్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.