ఎమ్మెల్యే భూమనకు Corona
ABN , First Publish Date - 2022-07-08T02:44:20+05:30 IST
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోమారు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా రెండుసార్లు కరోనా బారినపడ్డారు.
తిరుపతి: తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోమారు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా రెండుసార్లు కరోనా బారినపడ్డారు. గుంటూరులో జరగనున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలకు ముందస్తుగా వెళ్లిన ఎమ్మెల్యే గత బుధవారం జ్వరం రావడంతో గురువారం ఉదయం విజయవాడలోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. మధ్యాహ్నం కరోనా పాజిటివ్గా డాక్టర్ నిర్ధారణ చేశారు. దీంతో భూమన విజయవాడ నుంచి తిరుపతికి తిరుగుప్రయాణమయ్యారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండాలని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. డాక్టర్ల సలహా మేరకు శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స తీసుకోనున్నారు.