ప్రభుత్వ పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2021-09-09T02:52:29+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ ఒక్కరోజే
పశ్చిమ గోదావరి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. ఈ ఒక్కరోజే 16 మందికి కరోనా పాజిటివ్ నమోదు అయింది. 11 మంది విద్యార్థులకు, ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో జిల్లాలో 90 మంది విద్యార్థులకు, 48 మంది టీచర్లకు కలిపి మొత్తం 138 మందికి కరోనా సోకింది.