భారత్‌లో నేడు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-18T15:22:05+05:30 IST

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.

భారత్‌లో నేడు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

ఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు రోజు వారీ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,38,018 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా.. కరోనాతో 310 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17,36,628కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.09% కాగా.. మరణాల రేటు 1.29%గా ఉంది. కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు 14.43% శాతానికి పెరిగింది.


Updated Date - 2022-01-18T15:22:05+05:30 IST