4 నెలల కనిష్ఠానికి కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-27T05:27:11+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు నాలుగు నెలల కనిష్ఠానికి చేరాయి.

4 నెలల కనిష్ఠానికి కరోనా కేసులు

కొత్తగా 57 నమోదు


విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు నాలుగు నెలల కనిష్ఠానికి చేరాయి. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తరువాత ఈ ఏడాది మార్చి 19న 37 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత నుంచి ఆ సంఖ్య పెరుగుతూ వెళ్లింది. ఏప్రిల్‌, మే నెలల్లో వేలాది కేసులు నమోదయ్యాయి. మళ్లీ, జూన్‌ నుంచి తగ్గాయి. అయితే, సోమవారం అతి తక్కువగా 57 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 1,52,380 అయ్యాయి. ఇందులో 1,49,550కు మంది కోలుకున్నారు. చికిత్స పొందుతూ సోమవారం మరో ఇద్దరు మృతిచెందడంతో, కొవిడ్‌ మరణాల సంఖ్య 1,049కు చేరింది. 


మరో బ్లాక్‌ ఫంగస్‌ కేసు

జిల్లాలో సోమవారం మరో బ్లాక్‌ ఫంగస్‌ కేసు నమోదైంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 355కు చేరింది. ఇందులో 246 మంది కోలుకోగా,  ఇప్పటివరకు 32 మంది మృతిచెందారు.

Updated Date - 2021-07-27T05:27:11+05:30 IST