దేశవ్యాప్తంగా 32,937 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-16T17:08:01+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.

దేశవ్యాప్తంగా 32,937 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...417 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 35,909 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,81,947 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,31,642గా ఉంది. 

Updated Date - 2021-08-16T17:08:01+05:30 IST