దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-08-28T15:39:24+05:30 IST

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగ 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు.

దేశ వ్యాప్తంగా 46,759 కొత్త కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 509 మంది మృతి చెందారు. అలాగే  31,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 46,759 కేసులు నమోదు అయితే అందులో ఒక్క కేరళ రాష్టంలో 32,801 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 3,26,49,947కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,18,52,802గా ఉంది. ప్రస్తుతం 3,59,775 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనాతో 4,37,370 మంది మృతి చెందారు. 62,29,89,134 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 

Updated Date - 2021-08-28T15:39:24+05:30 IST