దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3,32,730 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-04-23T15:36:00+05:30 IST

ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,32,730 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 3,32,730 మందికి కరోనా

ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,32,730 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. నిన్న ఒక్కరోజే కరోనాతో 2,263 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695కి చేరుకుంది. కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159 ఉండగా.. యాక్టివ్ కేసులు 24,28,616గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,86,920కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



Updated Date - 2021-04-23T15:36:00+05:30 IST