కరోనా కేసులు 94

ABN , First Publish Date - 2021-10-24T07:27:05+05:30 IST

జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ కొత్తగా 94 మందికి కరోనా వైరస్‌ సోకింది.

కరోనా కేసులు 94

తిరుపతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్ర, శనివారాల నడుమ 24 గంటల్లో కొత్తగా 94 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 246346కు పెరిగింది. శనివారం ఉదయానికి జిల్లాలో 978 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన  కేసులు తిరుపతి నగరంలో 13, తిరుపతి రూరల్‌, మదనపల్లె మండలాల్లో 9 చొప్పున, చిత్తూరులో 6, పీలేరు, వాల్మీకిపురం మండలాల్లో 5 వంతున, కేవీపల్లె, చిన్నగొట్టిగల్లు, పూతలపట్టు మండలాల్లో 4 చొప్పున, పాకాలలో 3, పుత్తూరు,నగరి, పుంగనూరు, ఎర్రావారిపాలెం, కలికిరి, పెనుమూరు, సదుం, యాదమరి, రేణిగుంట, సోమల మండలాల్లో 2 వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-24T07:27:05+05:30 IST