కరోనా నియంత్రణలో ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకోండి

ABN , First Publish Date - 2021-05-09T05:45:56+05:30 IST

కరోనాను నియంత్రించడం కోసం ఇతర రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను చూసైనా ముఖ్యమంత్రి జగన్‌ నేర్చుకోవాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు శనివారం ఓ ప్రకటనలో సూచించారు.

కరోనా నియంత్రణలో ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకోండి

  • టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ, మే 8: కరోనాను నియంత్రించడం కోసం ఇతర రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను చూసైనా ముఖ్యమంత్రి జగన్‌ నేర్చుకోవాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నుంచి వైసీపీ నేతల వరకు వారు చేస్తున్న నిర్లక్ష్యాలకు ప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీ, మహరాష్ట్ర, రాజస్తాన్‌, తమిళనాడు రాష్ట్రాలు పెద్దఎత్తున వ్యాక్సిన్‌ను ఆర్డర్లు ఇచ్చాయని, కాని మన ముఖ్యమంత్రి మాత్రం కమీషన్లు రావని ఆ స్థాయిలో వ్యాక్సిన్‌ కోనుగోలు చేయడం లేదని ఆరోపించారు. ఆక్సిజన్‌ కొరతతో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కరోనా రోగుల ఆర్తనాదాలు కలచి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తొలిదశలో పని చేసిన ఫ్రంట్‌లైను వారియర్స్‌కు జీతాలు ఇవ్వకుండా వెళ్లగొట్టారని ఇప్పుడున్న సిబ్బంది కరోనా రోగులకు సేవలు అందించేందుకు జంకుతున్నారని విమర్శించారు.

Updated Date - 2021-05-09T05:45:56+05:30 IST