ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 24 మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2021-01-22T05:13:58+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 24మంది కొవిడ్‌ సోకినట్లు తెలిసింది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 24 మందికి కొవిడ్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం సంక్షేమ విభాగం, జనవరి 21: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 24మంది కొవిడ్‌ సోకినట్లు తెలిసింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 627మందికి పరీక్షలు నిర్వహించగా 16మందికి పాజిటివ్‌ వచ్చిందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో కొత్తగూడెం డివిజన్‌లో ఐదుగురు, భద్రా చలం డివిజన్‌లో 11 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ రోజువారీ నివేదికలో వెల్లడించారు. 

Updated Date - 2021-01-22T05:13:58+05:30 IST