కరోనా మృతదేహం తారుమారు

ABN , First Publish Date - 2020-09-26T21:54:33+05:30 IST

కరోనా మృతదేహం తారుమారయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్వాకం జరిగింది. ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన హన్మంతు కరోనాతో మృతి చెందాడు.

కరోనా మృతదేహం తారుమారు

నిజామాబాద్‌: కరోనా మృతదేహం తారుమారయింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ నిర్వాకం జరిగింది. ఇందల్‌వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన హన్మంతు కరోనాతో మృతి చెందాడు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది స్వగ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలకు కొన్ని క్షణాల ముందు మృతదేహం తారుమారైనట్లు గుర్తించారు. అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్‌ డ్రైవర్‌కు ఆస్పత్రి నుంచి సమాచారం అందింది. మృతదేహాలు తారుమారు కావడంపై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మంతు మృతదేహాన్ని అప్పగించి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువులు అడిగారు.

Updated Date - 2020-09-26T21:54:33+05:30 IST