ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా
ABN , First Publish Date - 2021-07-27T00:34:34+05:30 IST
ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం కొత్తగా 1,627 కరోనాకి కరోనా సోకింది. ఈ రోజు నమోదయిన
అమరావతి: ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రం కొత్తగా 1,627 కరోనాకి కరోనా సోకింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో మొత్తం 19,56,392కు పాజిటివ్ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 17 మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13,273 మంది మృతి చెందారు. ఏపీలో 21,748 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 2,017 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. గత 24గంటల్లో 57,672 శాంపిల్స్ సేకరించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు.