కాంట్రాక్ట్ కార్మికులకు కరోనా నిర్ధారణ పరీక్షలు
ABN , First Publish Date - 2021-01-22T05:57:39+05:30 IST
హెచ్పీసీఎల్లో విధులు నిర్వహించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులకు శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో రోజూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
మల్కాపురం, జనవరి 21 : హెచ్పీసీఎల్లో విధులు నిర్వహించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులకు శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో రోజూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో నెగెటివ్ వచ్చిన వారికే హెచ్పీసీఎల్ యాజమాన్యం పని కల్పిస్తోంది. దీంతో అధిక సంఖ్యలో కార్మికులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే పరీక్షలకు వచ్చే వారు మాస్క్లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చెందుతున్నాయి.