కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలి
ABN , First Publish Date - 2020-10-24T11:22:19+05:30 IST
కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వైద్యఆరోగ్యశాఖ అధికారు లతో సమీక్ష నిర్వహించారు
కామారెడ్డి, అక్టోబరు 23: కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వైద్యఆరోగ్యశాఖ అధికారు లతో సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు లేకుండా చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలని సూచించారు. కరోనా పాజిటి వ్ వచ్చిన వ్యక్తిని, ప్రథమ, ద్వితీయ కాంటాక్ట్ వ్యక్తులను కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఐసీడీఎస్ పీడీ అనురాధ,అధికారులు పాల్గొన్నారు.
161 జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
జాతీయ రహదారి నెం. 161 పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని చాంబర్లో అధికారులతో సమీక్షించా రు. పిట్లం, బిచ్కుంద మండలాలకు చెందిన 12 గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారని ప్రజాప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని పేర్కొ న్నారు. అటవీ, ట్రాన్స్కో, నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పని చేసే హైవే రోడ్లు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, దేవాదాయశాఖ కమిషనర్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.