రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం!

ABN , First Publish Date - 2022-07-01T08:23:16+05:30 IST

రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం!

రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం!

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. రెండు రోజులుగా కేసులు 200కు చేరువవుతున్నాయి. మొదటి, రెండు, మూడు దశల మాదిరిగా తీవ్రస్థాయిలో విస్తరించే పరిస్థితి లేదని వైద్యులు చెబుతున్నా.. అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల్లో 2,538 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 194 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 65 కేసులు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో 38 కేసులు, తిరుపతిలో 21, గుంటూరులో 20 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పక్క రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు వందల్లో నమోదవుతున్నాయి. పక్క రాష్ట్రాల్లోని కేసులు, ఏపీలో నమోదవుతున్న కేసులను పరిగణలోకి తీసుకుని ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్ని అప్రమత్తం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కరోనా పట్ల అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదని, గతంలో మాదిరిగానే మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ ఉపయోగించడం వంటివి కచ్చితంగా అమలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2022-07-01T08:23:16+05:30 IST