కరోనాతో కుటుంబం కకావికలం

ABN , First Publish Date - 2020-10-27T14:17:09+05:30 IST

కరోనా ఓ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఇద్దరు కుమారులు..

కరోనాతో కుటుంబం కకావికలం

మాచర్ల(గుంటూరు): కరోనా ఓ కుటుంబాన్ని కకావికలం చేసింది. ఇద్దరు కుమారులు మరణించగా.. ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మాచర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఆర్యవైశ్య కుటుంబంలోని దంపతులకు ఇద్దరు కుమారులు. ఎరువుల దుకాణం నిర్వహించే పెద్ద కుమారుడు(40) మూడు నెలల క్రితం కరోనా బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఫర్నీచర్‌ షాపు నిర్వహించే చిన్న కుమారుడు(38) కూడా కరోనాతో మూడు నెలలుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు. చివరగా హైదరబాద్‌లోని చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. కళ్ల ముందే కుమారులు కరోనాతో మృతి చెందడంతో వృద్ధులైన వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో మానసిక స్థైర్యం కోల్పోయిన తల్లి సోమవారం నాగార్జున సాగర్‌ కుడి కాలువలో దూకి ఆత్మ హత్య చేసుకుంది.  

Updated Date - 2020-10-27T14:17:09+05:30 IST