11 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-07-26T04:36:46+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం 9,277 మందికి కొవిడ్ పరీ క్షలు నిర్వహించారు. వారిలో 11 మం దికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్, జూలై 25 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆదివారం 9,277 మందికి కొవిడ్ పరీ క్షలు నిర్వహించారు. వారిలో 11 మం దికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహబూబ్నగర్ జిల్లాలో 655 మం దికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గ ద్వాల జిల్లాలో 2,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురు కరోనా బారిన పడ్డట్లు తేలింది. నాగర్కర్నూల్ జిల్లాలో 3,530 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. వారిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వనపర్తి జిల్లాలో 2,702 పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో 138 టెస్టులు చేశారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది.