493 మందికి కొవిడ్‌... 8 మంది మృతి

ABN , First Publish Date - 2021-06-24T06:33:08+05:30 IST

జిల్లాలో 24 గంటల్లో కరోనా వైరస్‌ బారినపడి ఎనిమిది మంది మృతిచెందారు.

493 మందికి కొవిడ్‌... 8 మంది మృతి

తిరుపతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ, బుధవారాల నడుమ 24 గంటల్లో 493 మందికి కరోనా నిర్ధారణ కాగా వైరస్‌ బారిన పడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఎనిమిది మంది మృతిచెందారు. తాజాగా గుర్తించిన బాధితులతో జిల్లాలో ఇప్పటి దాకా నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 215684కి చేరగా కొవిడ్‌ మృతుల సంఖ్య 1556కు పెరిగింది. బుధవారం ఉదయానికి జిల్లాలో 7563 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు తిరుపతిలో 49, చిత్తూరులో 33, తిరుపతి రూరల్‌లో 31, మదనపల్లెలో 23,  సదుంలో 19, పలమనేరు, పులిచెర్ల మండలాల్లో 15 వంతున, ఐరాల, పీటీఎం మండలాల్లో 14 చొప్పున, బి.కొత్తకోటలో 13, ఏర్పేడు, గంగవరం మండలాల్లో 12 వంతున, పెద్దమండ్యంలో 11, పీలేరులో 10, పుత్తూరు, రేణిగుంట, తవణంపల్లె మండలాల్లో 9 చొప్పున, ఎస్‌ఆర్‌ పురం, కలికిరి, కుప్పం మండలాల్లో 8 వంతున, ములకలచెరువు, రామచంద్రాపురం, జీడీనెల్లూరు, నగరి, పుంగనూరు మండలాల్లో 7చొప్పున, కార్వేటినగరం, సోమల, కురబలకోట, పిచ్చాటూరు మండలాల్లో 6వంతున, గుడుపల్లె, నారాయణవనం, సత్యవేడు, గుర్రంకొండ, చౌడేపల్లె, పూతలపట్టు, చంద్రగిరి, కలకడ, ఎర్రావారిపాళ్యం మండలాల్లో 5 చొప్పున, వి.కోట, పెద్దపంజాణి, తంబళ్లపల్లె, శాంతిపురం, వరదయ్యపాళ్యం, చిన్నగొట్టిగల్లు, పాకాల, తొట్టంబేడు, శ్రీకాళహస్తి మండలాల్లో 4 వంతున, వెదురుకుప్పం, పెనుమూరు, గుడిపాల, విజయపురం మండలాల్లో 3 వంతున, బైరెడ్డిపల్లె, రొంపిచెర్ల, వడమాలపేట, కేవీబీపురం, నిమ్మనపల్లె, నిండ్ర మండలాల్లో 2 చొప్పున, బంగారుపాళ్యం, రామసముద్రం, నాగలాపురం, రామకుప్పం, వాల్మీకిపురం, యాదమరి, కేవీపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-06-24T06:33:08+05:30 IST