ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా
ABN , First Publish Date - 2022-06-26T06:14:46+05:30 IST
ఇరు జిల్లాల్లో నలుగురికి కరోనా
ఖమ్మం కలెక్టరేట్/కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూన25: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 558 మందికి పరీక్షలు నిర్వహించగా మూడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంహెచవో డాక్టర్ మాలతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,066 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ నమోదైంది.