కివీస్‌ జట్టులో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2022-05-21T09:32:08+05:30 IST

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టులో కరోనా కలకలం రేపింది.

కివీస్‌ జట్టులో ముగ్గురికి కరోనా

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టులో కరోనా కలకలం రేపింది. శుక్రవారం ససెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు ముందు.. ఉదయం అందరికీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించారు. ఇందులో హెన్రీ నికోల్స్‌, బ్లెయిర్‌ టిక్నర్‌తో పాటు బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ జర్గెన్‌సెన్‌ పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ ముగ్గురిని ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచారు. మిగతా ఆటగాళ్లు నెగెటివ్‌గా తేలడంతో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారమే ఆరంభమైంది. న్యూజిలాండ్‌ జట్టు స్టోక్స్‌ సేనతో మూడు టెస్టుల సిరీ్‌సలో ఆడనుంది.

Updated Date - 2022-05-21T09:32:08+05:30 IST