గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-17T22:57:39+05:30 IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.

గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. డాక్టర్లు, హౌస్‌ సర్జన్స్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు.

Updated Date - 2022-01-17T22:57:39+05:30 IST