ఉమ్మడి జిల్లాలో కొత్తగా 48 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-27T03:39:16+05:30 IST

ఉమ్మడి జిల్లాలో సోమవారం 48 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 4,258 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 33 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 355 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయగా 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

ఉమ్మడి జిల్లాలో కొత్తగా 48 కరోనా కేసులు

సిద్దిపేట/సంగారెడ్డి అర్బన్‌/మెదక్‌ అర్బన్‌, జూలై 26: ఉమ్మడి జిల్లాలో సోమవారం 48 కరోనా కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 4,258 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 33 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 355 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేయగా 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిమిత్తం 34 శాంపిళ్లు గాంధీ ఆస్పత్రికి పంపినట్టు వైద్యాధికారులు తెలిపారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 573 మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించగా 3 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-07-27T03:39:16+05:30 IST