నూజివీడు డివిజన్లో 88 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-09T05:41:07+05:30 IST
నూజివీడు డివిజన్లో 88 కరోనా కేసులు
నూజివీడు, మే 8: నూజివీడు డివిజన్ పరిధిలో శనివారం 971 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 88 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం డివిజన్లో 1,018 యాక్టివ్ కేసులు ఉండగా, హోమ్ ఐసోలేషన్లో 990 మంది, గూడవల్లి కొవిడ్ కేంద్రంలో 8 మంది, వివిధ ఆసుపత్రుల్లో 20 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. నూజివీడులో రెండు పాజిటివ్ కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి బయటకు రావద్దని తెలిపారు. స్వీయ నియంత్రణ పాటించి కరోనాకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.