మహంకాళి ఆలయంలో ఏడుగురికి కరోనా

ABN , First Publish Date - 2022-01-21T17:11:12+05:30 IST

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాస్థానంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తున్నా 34 మంది సిబ్బందిలో ఏడుగురికి పాజిటివ్‌ రావడంతో భక్తులు

మహంకాళి ఆలయంలో ఏడుగురికి కరోనా

హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్‌:  సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాస్థానంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా నిబంధనలు పాటిస్తున్నా 34 మంది సిబ్బందిలో ఏడుగురికి పాజిటివ్‌ రావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దేవాలయంలో పనిచేసే ముగ్గురు అర్చకులు, మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో వారు ఐసొలేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్నారు. అధికారుల సూచన మేరకు ఆలయంలో ప్రతిరోజూ హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అమ్మవారిని దర్శనం చేసుకునే సమయంలో భౌతిక దూరం పాటించాలని కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-21T17:11:12+05:30 IST