కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-06-17T06:03:56+05:30 IST

కరోనా వలన మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

గాజువాక, జూన్‌ 16: కరోనా వలన మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం గాజువాక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన తెల్ల కార్డుదారులకు పది వేల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాస్‌, బొండా జగన్‌, మొల్లి ముత్యాలనాయుడు, పులి లక్ష్మిభాయి, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, నాయకులు పుచ్చా విజయ్‌కుమార్‌, పెద్దాడ సోమినాయుడు, వాసు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-17T06:03:56+05:30 IST